గచ్చిబౌలి,వెలుగు : సెక్స్ రాకెట్ నిర్వాహకులు, హ్యుమన్ ట్రాఫికర్స్పై సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం మాదాపూర్, బాలానగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ మేడ్చల్ జోన్లలో తనిఖీలు చేపట్టి 142 మంది హ్యుమన్ ట్రాఫికర్స్ను గుర్తించారు.
వీరంతా ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారా అనే వివరాలను తెలుసుకున్నారు. పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు.