- వేర్వేరు కేసుల్లో మోసపోయిన బాధితులు
- సైబర్ క్రైమ్ పీఎస్లో ఫిర్యాదు
బషీర్బాగ్, వెలుగు : సిటీకి చెందిన వేర్వేరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 2 కోట్లకు పైగా కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన సూర్యలతకు స్పిన్నింగ్ మిల్ కంపెనీ ఉంది. రూ.కోటి 40 లక్షల విలువైన మెటీరియల్ కోసం బ్రిటన్కు చెందిన ఓ కంపెనీతో ఆమె అగ్రిమెంట్ చేసుకుంది. మొదటగా రూ. 47 లక్షలను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఆమె మెయిల్కు ఓ మెసేజ్ వచ్చింది.
మిగతా డబ్బులను వేరే అకౌంట్కు పంపాలని బ్రిటన్కు చెందిన కంపెనీ తరఫున ఆ మెయిల్ మెసేజ్ ఉంది. దీన్ని నమ్మిన సూర్యలత రూ. 93 లక్షలను ఆ అకౌంట్కు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పింది. తమకు అమౌంట్ రాలేదని, మెయిల్ కూడా చేయలేదని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన సూర్యలత గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.
మిగతా మోసాలు ఇలా..
- క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని బోరబండకు చెందిన ఓ వృద్ధురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఆమెతో పలు దఫాలుగా రూ. 63 లక్షలు ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారు
- యూట్యూబ్ , ఫేస్బుక్లో లైక్స్ కొడితే పైసలిస్తమని, పార్ట్ టైం జాబ్ అని చెప్పి సికింద్రాబాద్కు చెందిన వ్యక్తిని మోసం చేసి రూ.47 లక్షలు కొట్టేశారు.
- ఐఆర్టీసీలో ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ ను క్రియేట్ చేసి మరో వ్యక్తి నుంచి రూ. 5 లక్షల 40 వేలు కాజేశారు.