రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ ను గెలిపించాలి : దానం నాగేందర్

రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ ను గెలిపించాలి : దానం నాగేందర్

ముషీరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు: రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ సికింద్రాబాద్​ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కోరారు. గురువారం రాత్రి ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాంగ్రెస్​సీనియర్​నేతలు అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, అరవింద్ కుమార్ యాదవ్ తో కలిసి దానం నాగేందర్ పాల్గొని మాట్లాడారు. కులగణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని రాహుల్​గాంధీ చెప్పారన్నారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ స్టేట్​మెంట్​ఇస్తే బీజేపీ సమాధానం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. రెండు సార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన కిషన్​రెడ్డి ఏనాడైనా పద్మశాలీల సమస్యలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రూ.కోట్లు తెచ్చామని చెబుతున్న కిషన్ రెడ్డి అంబర్​పేట బ్రిడ్జిని ఎందుకు పూర్తిచేయలేకపోయారని నిలదీశారు.

తనను ఎంపీగా గెలిపిస్తే పద్మశాలీలకు అండగా ఉంటానని దానం చెప్పారు. రాహుల్​గాంధీ ప్రధాని కావాలంటే కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గురువారం జూబ్లీహిల్స్​నియోజకవర్గం రహ్మత్​నగర్​డివిజన్​ ఎస్పీ ఆర్​హిల్స్ నుంచి హెచ్ఎఫ్​నగర్ వరకు కాంగ్రెస్​ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దానం నాగేందర్, అజారుద్దీన్, నవీన్​ యాదవ్, ఉపేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.