టీటీడీ బోర్డు మెంబర్​గా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

టీటీడీ బోర్డు మెంబర్​గా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, వెలుగు: టీటీడీ బోర్డు మెంబర్​గా దాసరి కిరణ్ కుమార్ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌‌వారి ఆల‌‌యంలోని బంగారు వాకిలి వద్ద  డిప్యూటీ ఈవో  ర‌‌మేష్‌‌ బాబు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న  కిరణ్ కుమార్​కు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, చిత్రప‌‌టాన్ని అందించారు. 

ఈ సందర్భంగా  కిరణ్ కుమార్ మాట్లాడుతూ..  స్వామికి సేవ చేసేందుకు తనకు బోర్డు సభ్యునిగా అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో క‌‌స్తూరీబాయి, పేష్కార్  శ్రీ‌‌హ‌‌రి, పారుపత్తేదార్ తులసీప్రసాద్ త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.