
మేనేజ్మెంట్/ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీకి గుజరాత్లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ అప్లికేషన్లు కోరుతున్నది. ఈ పోస్టులను ఒప్పందం ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 04.
పోస్టుల సంఖ్య: 65
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ 35 (అన్ రిజర్వ్డ్–19, ఓబీసీ –09, ఎస్సీ –05, ఎస్టీ –02)
గ్రాడ్యుయేట్ ట్రైనీ 30 (అన్ రిజర్వ్డ్-–17, ఓబీసీ –-07, ఎస్సీ –-04, ఎస్టీ– -02)
డిపార్ట్మెంట్స్: స్టాటిస్టికల్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లీగల్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకాం, బీఎస్సీ, బీసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ తదితర కంప్యూటర్ అప్లికేషన్సులో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 2025, జూన్ 1వ తేదీ నాటికి గ్రాడ్యుయేట్ ట్రైనీకి 25 ఏండ్లు, మేనేజ్మెంట్ ట్రైనీకి 28 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా. ది సెక్రటరీ, దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, గాంధీదామ్, కచ్చి, గుజరాత్.
లాస్ట్ డేట్: జులై 04.
సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.