న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగే మెన్స్ హాకీ వరల్డ్కప్లో పోటీ పడే ఇండియాకు డిఫెండర్ హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. జనవరి 13 నుంచి ఒడిశాలో జరిగే ఈ టోర్నీ కోసం హాకీ ఇండియా 18 మందితో కూడిన టీమ్ను శుక్రవారం ప్రకటించింది. అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
టీమ్: క్రిషన్ బహదూర్, శ్రీజేష్ (గోల్ కీపర్లు), జర్మన్ప్రీత్ , సురేందర్ హర్మన్ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, నీలం సంజీప్ (డిఫెండర్లు), మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ , ఆకాశ్దీప్ ( మిడ్ఫీల్డర్లు), మన్దీప్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్ (ఫార్వర్డ్స్