ఫెయిల్ అయ్యిందని డిగ్రీ స్టూడెంట్ సూసైడ్

ఫెయిల్ అయ్యిందని డిగ్రీ స్టూడెంట్ సూసైడ్

జనగామ: ఎగ్జామ్ లో తక్కువ మార్కులొచ్చాయని ఓ విద్యార్థినిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం జనగామలో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. రఘునాథపల్లి మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్య(20) అనే అమ్మాయి డిగ్రీ చదువుతుంది.  డిగ్రీ సెకండియర్ పరీక్షలు రాసిన ఆమె, ఇటీవల విడుదలైన ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఫైనలియర్‌ కు అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర అవమానానికి గురైన సంధ్య, మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంధ్య తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. వారిని ఆపడం ఎవరితరం కావడం లేదు. స్థానికులు కూడా సంధ్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.