ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే!.. ఢిల్లీ పేలుడులో లెటర్ కలకలం

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే!.. ఢిల్లీ పేలుడులో లెటర్ కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్‌‌ రాయబార కార్యాలయం దగ్గరలో శుక్రవారం పేలుడు జరగడం సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సంపాదించారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కారులో నుంచి దిగి ఇజ్రాయెల్ ఎంబసీ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన డ్రైవర్‌‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడు చెప్పిన గుర్తుల ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తుల స్కెచ్‌‌లను గీయిస్తున్నారు.

ఈ విచారణలో మన పోలీసులకు సహకరించేందుకు ఇజ్రాయెల్ నుంచి ఇన్వెస్టిగేటర్స్ టీమ్ శనివారం భారత్‌‌కు చేరుకుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఓ లెటర్ దొరికింది. ఇందులో గతేడాది చనిపోయిన ఇరాన్ హై-లెవల్ కమాండర్ ఖాసీం సులేమానీ, న్యూక్లియర్ సైంటిస్ట్ ఫక్రజదే పేర్లు ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడుకు ఇరాన్‌‌కు సంబంధం ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసులకు దొరికిన లెటర్‌‌లో ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని రాసి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో దేశంలోని ప్రధాన సిటీల్లో సెక్యూరిటీ ఫోర్సెస్‌‌ను అప్రమత్తం చేశారు.