
బెంగళూరు: ఐపీఎల్ 12 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో డిల్లీ క్యాపిటల్స్ పై జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 150 రన్స్ టార్గెట్ ను 18.5 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 67 రన్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ పృథ్వీ షా 28, కొలిన్ ఇంగ్రామ్ 22, రిషబ్ పంత్ 18 రన్స్ తో రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.150 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందుంచింది. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 41 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసి జట్టుకు 149 రన్స్ వచ్చాయి. మధ్యలో మొయిన్ అలీ 18 బంతుల్లో 32 రన్స్ తో పరవా లేదనిపించాడు. మిగతా బ్యాట్స్ మెన్ 20 పరుగులలోపే ఔటయ్యారు. 18వ ఓవర్లో కోహ్లీ, అక్షర్దీప్ నాథ్, పవన్ నేగీ ముగ్గురినీ ఔట్ చేసిన రబాడా మొత్తం నాలుగు వికెట్లు తీశాడు ఈ మ్యాచ్ లో.