
టీమిండియాతో మొదటి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన అస్ట్రేలియా జట్టుకు ఇప్పుడు ఢిల్లీలో టెన్షన్ పట్టుకుంది. ఢిల్లీ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 17 న ప్రారంభం కానుంది. అరుణ్ జైట్లీ మైదానంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. గత 36 ఏళ్లుగా ఇక్కడ మరో విదేశీ టీమ్ గెలవలేదు. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 34 టెస్టు మ్యాచ్ లు జరగగా అందులో టీమిండియా 13 మ్యాచ్ ల్లో గెలిచి 6 మ్యాచ్ లోఓడిపోయింది. ఆసీస్ ఇక్కడ 7 మ్యాచ్ లు ఆడి ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్ 1959లో జరిగింది. ఇదే వేదికపై టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీశాడు.