కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత

కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశాలతో మే 16 మంగళవారం ఉదయం గాజులరామరం, దేవేందర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది.

కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిదిలోని గాజులరామరంలో ఆర్.డి.ఓ మల్లయ్య ఆధ్వర్యంలో భారీ కూల్చివేతలు చేపట్టారు. గాజులరామరం, దేవేందర్ నగర్ లోని ప్రభుత్వ భూమి 342 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలను 4 జేసీబీలతో కూల్చివేశారు జిల్లా రెవెన్యూ యంత్రాంగం. పోలీస్ ప్రొటక్షన్ తో 4 జేసీబీలు,4 డీసీఎంలు, 2 వాటర్ ట్యాంకర్లు, గోనె సంచులతో భారీ స్థాయిలో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు.