జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ దేవేందర్నగర్లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. కొంతమంది ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ఆక్రమణలను గుర్తించిన అధికారులు పోలీసు బందోబస్తు మధ్య సుమారు 10 ఇళ్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా స్థానికులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడంతో అధికారులు కూల్చివేతలు కొనసాగించారు.
కమిషనర్ అవినీతిపై చర్యలేవి
జీడిమెట్ల, వెలుగు: కొంపల్లి మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మాజీ వార్డు మెంబర్జమ్మి దేవేందర్ ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జాయింట్ కలెక్టర్నరసింహారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో వివిధ పనుల్లో కొంపల్లి కమిషనర్ రూ.10 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఆడిటర్స్ తేల్చినట్లు పేర్కొన్నారు. కానీ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.