డబ్బుల్లేక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

డబ్బుల్లేక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నికల జరగనున్నాయి. JDS అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉప ఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు. తమ దగ్గర డబ్బు లేదని.. అందుకే తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించడం లేదని చెప్పారు. అయితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కింది స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తామని తెలిపారు. 2023 నాటికి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బసవకల్యాణ్, మస్కీ, సిందగీ అసెంబ్లీ నియోజకవర్గాలు, బెల్గాం లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.