మహబూబ్నగర్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

 మహబూబ్నగర్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. సాయంకాలం పుష్కర ఘాట్ లో అర్చకులు తుంగభద్రా నదికి హారతి ఇచ్చారు. 

అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను కేంద్ర మంత్రి మురళీధరన్​ దర్శించుకున్నారు. కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -_అలంపూర్, వెలుగు