న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కథ ముగిసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆ పార్టీపై ప్రజల్లో అభిమానం పోయిందని, గెలిచిన ఎమ్మేల్యేలు ఇక ముందు జారుకుం టారని చెప్పారు. న్యాచురల్ డెత్ లాగా ఆ పార్టీ పతనం అవుతుందని చెప్పారు. దీంతో రాబోయే రోజు ల్లో తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారుతుందన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఓటమి చవిచూసినా.. బీజేపీ మెజారిటీ సాధించకపోవడంతో సగం సంతోషంగానే ఉందన్నారు. దీనిపై అంతర్గతంగా చర్చ జరగాల్సి ఉంద న్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి చేతికి పగ్గాలు ఇచ్చాక కూడా డిపా జిట్ రాని పరిస్థితులు ఉన్నాయ న్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.