- న్యాయం చేయాలంటున్న ధర్మారెడ్డి కూతురు
- కండీషనల్ బెయిల్పై వచ్చిన ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్రెడ్డి
హైదరాబాద్(కుషాయిగూడ), వెలుగు: కీసర ఎమ్మార్వో నాగరాజు కోటి పది లక్షల లంచం కేసులో నిందితుడు కందాడి ధర్మారెడ్డి సూసైడ్ సంచలనం సృష్టిస్తోంది. 4 రోజుల క్రితం బెయిలుపై విడుదలైన ధర్మారెడ్డి ఆదివారం ఉదయం వాసవి శివానగర్, కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఇదే కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్రెడ్డి సోమవారం కండీషనల్ బెయిల్పై వచ్చి అంత్యక్రియలు చేశారు. ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేశారా ? లేక హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారా అని ఆయన బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కూతురు ఉమ మాట్లాడుతూ.. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి తమ వారసత్వ భూమిపై కన్ను వేశాడని, 97 ఎకరాల భూమిలో కేఎల్ఆర్ పేరుతో పలు కంపెనీలు ఏర్పాటు చేశారని, కుట్ర పూరితంగానే తమను ఈ కేసులో ఇరికించారన్నారు. ఈ భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని చెప్పారు. పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలన్నారు