
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా ఇండియా ఎంత డెవలప్ అయిందో జీ20 సమిట్కు వచ్చే గెస్ట్లకు తెలియజేసేందుకు ‘భారత్ మండపం’లో ‘డిజిటల్ ఇండియా ఎక్స్పీరియన్స్ జోన్’ ఏర్పాటు చేశారు. యూపీఐ నుంచి నేషనల్ టెలీ మెడిసిన్ సర్వీస్ దాకా వివిధ రకాల డిజిటల్ సేవల గురించి అతిథులకు ఇక్కడ వివరిస్తారు. కొన్ని కీలకమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు కూడా ఈ జోన్లో ఏర్పాటు చేశారు.
ఇక్కడి నుంచి వర్చువల్ రియాలిటీ ద్వారా డిజిటల్ ఇండియా కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. ఈ సమిట్కు ‘డిజిటల్ ఇండియా ఎక్స్పీరియన్స్ జోన్’ కీలకంగా మారనుంది. 4, 14 నంబర్ హాల్లో ఈ జోన్ ఏర్పాటు చేశారు. ఏఐ బేస్డ్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ భాషిణి, ఆధార్, డిజీ లాకర్, దీక్ష పోర్టల్ వంటివి ఈ జోన్లో ఉంటాయి. ఇండియా ఎలా డిజిటల్ టెక్నాలజీలో దూసుకెళ్తున్నదన్న వీడియోను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. డిజిటల్ పరంగా బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇండియా ఎలా అందిస్తున్నదో ఈ–సంజీవని ప్రాజెక్ట్ తెలియజేస్తుంది.