నిజాలు తెలుసుకొని రాయండి.. సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు కామెంట్స్

నిజాలు తెలుసుకొని రాయండి.. సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు కామెంట్స్

సినిమా వాళ్లకి సంక్రాంతి అనేది పెద్ద సీజన్. అందుకే ఈ సీజన్ కోసం పెద్ద హీరోలు సైతం సిద్దమవుతుంటారు. ఈ వార్ ప్రతీ సంవత్సరం ఉండేదే. అలాగే ఈ ఇయర్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వార్ జరుగనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి పోటీపడనున్నాయి. ముందుగా ఐదు సినిమాలు పోటీలో నిలువగా.. రవితేజ ఈగల్ మూవీ పోటీ నుండి తప్పుకుంది. 

ఇదే విషయాన్నీ తెలియజేస్తూ ఈగల్ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. తమ సినిమాను ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయం జరిగిన మీటింగ్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సినిమాలపై, వాటిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో వస్తున్న వార్తల వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజానిజాలు తెలుసుకొని రాస్తే మంచిది. సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాతలతో మేము చర్చించాం. ఒక సినిమా వెనక్కి తగ్గినంత మాత్రాన ఏదో జరిగినట్టు కాదు. గత సంక్రాంతికి మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారు కానీ.. ఇప్పుడు ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. అందుకే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. అందులో రవితేజ ఈగల్ మూవీని ఫిబ్రవరికి పొస్ట్ పోన్ చేసుకున్నారు. అందుకు రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.