గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి సంబంధం లేని కేసులో తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు..డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.
ALSO READ :- 2024 మార్చిలో రాబోయే కొత్త బైకులు ఇవే..
ఫిబ్రవరి 24న గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు.ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ ఏ10గా ఉన్నారు. డ్రగ్స్ పార్టీలో శ్వేత, లిసి, నీల్, సందీప్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు గుర్తించారు. పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి 1 గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.