SS Rajamouli : జపాన్లో భూకంపం.. జక్కన్న ఎమోషనల్ ట్వీట్

SS Rajamouli : జపాన్లో భూకంపం.. జక్కన్న ఎమోషనల్ ట్వీట్

జపాన్ 7.5 తీవ్రతతో భారీ భూకంపాన్నిఎదుర్కొంది. ఈ భారీ భూకంపం జపాన్ను అతలాకుతలం చేసింది. వరుస ప్రకంపనలతో వేలాది ఇండ్లు,  భవనాలు కుప్పకూలిపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. 

లేటెస్ట్గా ఇదే విషయంపై  డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ..ప్రస్తుత జపాన్లో భూకంపాలు సంభవించాయనే న్యూస్ తనను ఎంతో కలిచివేస్తోందని ట్వీట్ చేశాడు. జపాన్ దేశానికి మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని..ఆ దేశం నా ఆలోచనలకు చాలా సహకారం అందించిందని ట్వీట్లో తెలిపారు.

 

అలాగే ఇదే విషయంపై.. RRR టీమ్ జపనీస్ భాషలో స్పందిస్తూ.. జపాన్లో సంభవించిన తీవ్రమైన భూకంపం గురుంచి తెలుసుకుని చాలా ఆందోళన చెందాం. అక్కడ ఉన్న మా అభిమానులు..వారి కుటంబాలు.. ప్రతి పౌరుడు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

 

 

డైరెక్టర్ రాజమౌళికి..జపాన్‌కు ప్రత్యేక అటాచ్ మెంట్ ఉంది. 'RRR' మూవీ జపాన్‌లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించింది. దాదాపు బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో రాజమౌళికి జపాన్ లో చాలా మంది అభిమానులున్నారు. 

అలాగే ఒక వారం పాటు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో జపాన్లో ఉండడంతో..ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడ్డారు. దీంతో లేటెస్ట్గా తారక్..తాను ఇండియాకి సేఫ్‌గా చేరుకున్నానని..జపాన్‌కి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని.. వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ..ఓ పోస్ట్ చేసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.