థ్రిల్ చేసేలా బాగుంది

థ్రిల్ చేసేలా బాగుంది

కిషోర్ తేజ, భవ్యశ్రీ జంటగా రామ్ కుమార్ దర్శకత్వంలో రాజనేని వెంకటేశ్వర్ రావు, డా. మహేంద్రబాబు నిర్మిస్తున్న చిత్రం ‘బాగుంది’. ఇటీవల ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుక జరిగింది. టీజర్‌‌‌‌ను లాంచ్ చేసిన దర్శకుడు వేణు ఉడుగుల,సెవెన్ హిల్స్ సతీష్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో మూడు పాటలు, మూడు ఫైట్స్ ఉన్నాయి. హీరో కిషోర్ తేజ చాలా బాగా చేశారు. కథ, కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. చూసిన వాళ్ళు కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు’ అని చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది అని నిర్మాత వెంకటేశ్వర్ రావు అన్నారు. హీరోహీరోయిన్స్‌‌తోపాటు టీమ్ అంతా పాల్గొన్నారు.