
ప్యాంగ్చాంగ్: ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో ఇండియా పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మానవ్ ఠక్కర్ 0–3తో చైనా లెజెండ్ మ లాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు రౌండ్32లో సత్యన్ 2–3తో అన్ జయెహ్యున్ (కొరియా) చేతిలో, శరత్ కమల్ 0–3తో టనకా యుటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో మానవ్–మానుష్ షా జోడీ 0–3తో చైనా జంట జెండాంగ్–లిన్ గయోయువన్ చేతిలో ఓడింది. విమెన్స్ క్వార్టర్స్లో ఐహికా–సుతీర్థ జంట కూడా 0–3తో వాంగ్ మన్యు–చెంగ్ మెంగ్ (చైనా) చేతిలో చిత్తయింది.