జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పైగా లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు వరకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు అగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని స్పష్టం చేశారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.