పద్మారావునగర్, వెలుగు: డ్యూటీలో రైల్వే అధికారులు, సిబ్బంది అంకిత భావం, సమష్టి కృషితోనే సౌత్సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ఉత్తమ డివిజన్గా నిలిచిందని డివిజనల్రైల్వే మేనేజర్ బర్తేశ్కుమార్ జైన్ తెలిపారు. సికింద్రాబాద్డివిజన్68వ రైల్వే వీక్ సెలబ్రేషన్స్ బోయిగూడలోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
డ్యూటీల్లో పనితీరు చూపిన ఉద్యోగులకు రైల్సేవా పురస్కార్-– 2023 అవార్డులను అందజేశారు. తమ విధుల్లో రైల్వే ఉద్యోగులు ఇలాగే నిబద్ధత కొనసాగించాలని బర్తేశ్ కుమార్ జైన్ఆకాంక్షించారు. మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలిని జైన్, ఏడీఆర్ఎంలు జి.సుబ్రహ్మణ్యం, రాజీవ్కుమార్, గోపాల్, ఎస్డీపీవో అభిలాష్ పాల్గొన్నారు.