ఉద్యోగుల కృషితోనే ఉత్తమ డివిజన్​గా నిలిచింది : బర్తేశ్​ కుమార్​ జైన్​

ఉద్యోగుల కృషితోనే ఉత్తమ డివిజన్​గా నిలిచింది : బర్తేశ్​ కుమార్​ జైన్​

పద్మారావునగర్​, వెలుగు: డ్యూటీలో రైల్వే అధికారులు, సిబ్బంది అంకిత భావం, సమష్టి కృషితోనే సౌత్​సెంట్రల్​ రైల్వేలో సికింద్రాబాద్​ఉత్తమ డివిజన్​గా నిలిచిందని డివిజనల్​రైల్వే మేనేజర్​ బర్తేశ్​కుమార్ ​జైన్ ​తెలిపారు. సికింద్రాబాద్​డివిజన్​68వ రైల్వే వీక్​ సెలబ్రేషన్స్ ​బోయిగూడలోని రైల్​ కళారంగ్ ​ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. 

డ్యూటీల్లో  పనితీరు చూపిన ఉద్యోగులకు రైల్​సేవా పురస్కార్​-– 2023 అవార్డులను అందజేశారు.  తమ విధుల్లో  రైల్వే ఉద్యోగులు ఇలాగే నిబద్ధత కొనసాగించాలని బర్తేశ్ ​కుమార్ ​జైన్​ఆకాంక్షించారు. మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలిని జైన్​, ఏడీఆర్ఎంలు జి.సుబ్రహ్మణ్యం, రాజీవ్​కుమార్, గోపాల్, ఎస్​డీపీవో అభిలాష్ పాల్గొన్నారు.