ఇది విన్నారా.. ఆక్కడా కుక్కలు..కాకులకు పూజ చేస్తారు

ఇది విన్నారా.. ఆక్కడా కుక్కలు..కాకులకు పూజ చేస్తారు

దీపావళి పండగను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జరుపుకుంటారు. రకరకాల పేర్లు, వేర్వేరు ఆచారాలతో ఈ పండగను జరుపుకుంటారు. మన పొరుగు దేశం నేపాల్ మాత్రం దీపావళిని ఐదు రోజు లపాటు జరుపుతారు. దీపావళిని నేపాల్ లో తిహార్ అని పిలుస్తారు. ఐదు రోజుల పండగలో జంతువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కో రోజు ఒక్కో పూజతో కాకులు, కుక్కలతో పాటు పెంపుడు జంతువులను ఘనంగా కొలుస్తారు. పండగ మొదటి రోజు కాగ్ తీహార్( కాకుల పండగ).. కాకిని యమదూతగా భావించి.. కొలుస్తారు. కాకులను పూజించడం ద్వారా మృత్యువును జయించవచ్చని.. అదృష్టాన్ని పొందవచ్చని వారి నమ్మకం. కాకులకు ఆహారంగాధాన్యం, విత్తనాలను ఇండ్లపైనా.. డాబాలపైనా ఉంచి మొక్కుతారు. 

రెండో రోజు కుకుర్ తీహార్.. 

దీపావళి రెండో రోజు కుకుర్ తీహార్.. కుకుర్ అంటే కుక్క.. పండగ రోజు కుక్కులను పూజిస్తారు. పూల మాలలు వేసి, తిలకం దిద్ది వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. పండగ మూడో రోజు గై పూజగా చెప్పుకుంటారు. యమపంచకంలో ఇది ముఖ్యమైనది. గై పూజలో భాగంగా గోవులను ముస్తాబు చేసి, పూజలు చేస్తారు. కుంకుమ దిద్ది, పూల మాలలు వేసివాటికి ఇష్టమైన తిండి పెడతారు. సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేస్తారు. 

పండగ నాలుగో రోజు.. పూజలో నేపాల్ వేర్వేరుసాంప్రదాయాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల పండగ నాలుగో రోజున గోరు తిహార్ ను చేస్తారు. గోవర్ధనగిరి, వ్యవసాయానికి సాయం చేసే ఎద్దులను పూజిస్తారు. ఆవుపేడతో కొండ ఆకారాన్ని చేసి దానికి పూజలు చేస్తారు. మరికొన్ని చోట్ల తమను తామే పూజించుకుంటారు. 

ఇక చివరి రోజు పండగ అన్నా చెల్లెళ్లది. దీనికి భాయ్ టికా అని పిలుస్తారు. తన అన్న,తమ్ముడు బాగుండాలని దేవుళ్లను ప్రార్థిస్తూ వాళ్ల నుదుట చెల్లెలు కుంకుమ బొట్టు పెడుతుంది. ఆ తర్వాత అన్నా చెల్లలు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు.