రేవంత్ రియల్​ ఎస్టేట్​తో డబ్బు సంపాదించిండు : డీకే అరుణ

రేవంత్ రియల్​ ఎస్టేట్​తో డబ్బు సంపాదించిండు :  డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు : రియల్ ఎస్టేట్ చేసుకుని డబ్బు సంపాదించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డికి.. రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ చేసిన కామెంట్లపై ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2003లో వ్యవసాయం దండగ అన్న అప్పటి సీఎం చంద్రబాబును ప్రజలు ఏమి చేశారో, ఇప్పుడు రేవంత్ పరిస్థితి కూడా అదే కాబోతుందని డీకే అరుణ తెలిపారు.  ఒక పక్క ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీఆర్ఎస్​ నేతలు అబద్ధాలు మాట్లాడుతుంటే, వారి మిత్రుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటలు దండగ అంటున్నారని డీకే అరుణ పేర్కొన్నారు.