శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

దర్శకరత్న దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణా ప్రభుత్వం చిత్రసీమకు ఎలాంటి సహకారమైనా అందించేందుకు ముందుంటుందని ఆయన తెలియజేశారు.

సీనియర్ నటులు మురళీ మోహన్, మోహన్ బాబు,  రోజా రమణి,  దర్శకులు ధవళ సత్యం, కోదండరామిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు,  అచ్చిరెడ్డి,  ఎన్.శంకర్, వీరశంకర్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, అనిల్ వల్లభనేని, ఆచంట గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.