పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్

పెళ్లి ఇష్టం లేక యువతి సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి సూసైడ్ చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. గాజులరామారానికి చెందిన శివరామకృష్ణ కూతరు వాసిరెడ్డి మేఘన(27) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. మేఘనకు పెళ్లిచేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ఇష్టం లేని ఆమె మనస్తాపంతో  శనివారం వివిధ రకాల ట్యాబ్లెట్స్ మింగింది. దీన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే సిటీలోని ఓ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మేఘన ఆదివారం చనిపోయింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.