విద్యుత్ ఉద్యోగుల వాహనాలు ఆపొద్దు

విద్యుత్ ఉద్యోగుల వాహనాలు ఆపొద్దు

హైదరాబాద్: ఆస్పత్రులకు 24 గంటలు కరెంట్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులను ఆపొద్దని.. వారి వాహనాలను సీజ్ చేయొద్దని పోలీసు శాఖను ఆయన కోరారు. నల్గొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులపై దాడులు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ డిపార్ట్మెంట్ ఐడీ కార్డ్ లేదా సంబంధిత పాస్ చూయిస్తే వదిలేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఎంప్లాయీస్ కు లాక్ డౌన్ మినహాయింపు ఉందని స్పష్టం చేశారు.