ఆర్ఎంపీల ట్రైనింగ్ పై డాక్టర్ల సంఘాల నిరసన

ఆర్ఎంపీల ట్రైనింగ్ పై డాక్టర్ల సంఘాల నిరసన

మంత్రి హరీశ్ రావు హామీని  వెనక్కి తీస్కోవాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మద్దతుగా నిలుస్తున్నారని డాక్టర్లు ఫైర్ అయ్యారు. పీఎంపీలకు ట్రైనింగ్, సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మంత్రి హామీని వెనక్కి తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం కోఠిలోని హెల్త్ డైరెక్టరేట్ ఆవరణలో డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధితో మంత్రి ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన ఆడియోను డాక్టర్లు మీడియాకు విడుదల చేశారు. నకిలీలకు ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తే ప్రజల ఆరోగ్యానికి మరింత ముప్పు తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్ అన్నారు. సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, 7న అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలకు, మెడికల్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు కంప్లయింట్ ఇస్తామన్నారు.

హరీశ్‌‌‌‌‌‌‌‌రావుతో పాటు పీఎంపీలకు మద్దతుగా మాట్లాడిన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ పైనా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ప్రధాని మోడీకి, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 14న డీహెచ్‌‌‌‌‌‌‌‌, మెడికల్ కౌన్సిల్ ఆఫీసులను ముట్టడిస్తామని, 15న ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ కార్తిక్, హెల్త్ రిఫార్మ్స్‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు డాక్టర్ మహేష్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్ కన్వీనర్ డాక్టర్ విజయేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.