
- ఆపరేషన్ సక్సెస్ చేసిన నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యులు ఓ మహిళ కడుపులో నుంచి 6 కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పర్వేదుకు చెందిన మహిళ రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి రాగా డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి, కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు.
బాధితురాలి కుటుంబసభ్యుల సమ్మతితో బుధవారం ఆపరేషన్ చేసి, 6 కిలోల కణితిని తొలగించారు. డాక్టర్లు శ్రీకాంత్ వర్మ, నిఖిత, వంశీ, దివ్య, అనస్తీషియా డాక్టర్లు బద్రి నారాయణ, నవీన్, సుధ, గిరి, శ్వేత నాలుగైదు గంటలపాటు శ్రమించి, శస్త్రచికిత్స సక్సెస్ చేశారు.