
- ఫండ్రైజ్ చేసిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్
అలీఘర్: ఉత్తర్ప్రదేశ్ అలీఘర్లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్లు ఫండ్స్ కలెక్ట్ చేసుకుని పీపీఈ కిట్లు కొనుకున్నారు. “ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫండ్స్ కలెక్ట్ చేసి పీపీఈలు కొనుకున్నాం, వాటితో పాటు మాస్కులు, శానటైజర్లు కూడా కొన్నాం” అని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షా నవాజ్ ఇక్బాల్ చెప్పారు. అయితే పీపీఈల కొరత ఉందన్న ఆరోపణల్లో నిజం లేదని, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అధికార ప్రతినిధి చెప్పారు.