సెప్టెంబర్ 13న ప్రభుత్వ డాక్టర్ల ధర్నా

 సెప్టెంబర్ 13న ప్రభుత్వ డాక్టర్ల ధర్నా

హైదరాబాద్, వెలుగు :  పీఆర్సీ ఎరియర్స్‌‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వ డాక్టర్లు పిలుపునిచ్చారు. ఉస్మానియా హాస్పిటల్‌‌ ఆవరణలోనే ధర్నా చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016 జనవరి నుంచి పీఆర్సీ ఎరియర్స్ పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. 

ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 142ను రద్దు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.