డాక్టర్ల నిర్లక్ష్యం: కడుపులో కాటన్ పెట్టి కుట్లేశారు

డాక్టర్ల నిర్లక్ష్యం: కడుపులో కాటన్ పెట్టి కుట్లేశారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ బాలింతకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు… సర్జికల్ కాటన్ ను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. డెలివరీ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో మళ్లీ హాస్పిటల్ కు వచ్చింది. దీంతో స్కానింగ్ తీసిన డాక్టర్లు అసలు విషయం చెప్పారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.