నిన్ను ఎవడన్నా లీడర్ గా గుర్తిస్తరా.. ?

నిన్ను ఎవడన్నా లీడర్ గా గుర్తిస్తరా.. ?

మీ జేజమ్మ దిగి వచ్చినా.. మీ మోడీ, అమిత్ షా వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు అన్నారు. చాలా మంది టీఆర్ఎస్ లీడర్లు బీజేపీ తో టచ్ లో ఉన్నారని ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చేరికలుంటాయని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనామకుడు ఈటలను మంత్రి చేస్తే ఇట్లేనా మాట్లాడేదన్నారు. అసలు నిన్ను ఎవడన్నా లీడర్ గా గుర్తిస్తారా అంటూ కామెంట్ చేశారు. నీకు దమ్ముంటే ఒక్కరన్న మా వాళ్ళు టచ్ లో వుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆధారాలు బయట పెట్టాలని బాలరాజు అన్నారు. తెలంగాణలో చిచ్చు పెడితే తగిన రీతిలో బుద్ది చెప్తామని ఆయన స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ లీడర్లు ఇష్టం లేకపోయినా పార్టీలో కొనసాగుతున్నారని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం‌ కేసీఆర్ పై పోటీ చేస్తామన్న ఈటల.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని కూడా ప్రకటించారు. అంతే కాదు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.