ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ సూచన
హైదరాబాద్, వెలుగు: కార్గో బస్సులపై తన ఫొటో వాడొద్దని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని, సరుకు రవాణాతో సంస్థ అభివృద్ధికి తోడ్పడే కార్గో బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సీఎం అభిప్రాయాన్ని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పి.రాజశేఖర్ రెడ్డి నోట్ ద్వారా తెలియజేశారు.