న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉంటున్న మాజీ కెప్టెన్ ఎం.ఎస్ . ధోనీ ఫ్యూచర్ ఏంటీ? ఆటకు గుడ్ బై చెబుతాడా? లేకఆసీస్ లో టీ20 వరల్డ్ కప్ లో ఆడతాడా? ప్రస్తుతానికి సమాధానాలు లేని ఈ ప్రశ్నలకు టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి కొద్దిగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ధోనీ ఫ్యూచర్ తేలాలంటే ఐపీఎల్ వరకు ఆగాలని అభిమానులకు, విమర్శలకు సూచించాడు. ప్రస్తుతానికి కోహ్లీ సారథ్యంలోని టీమ్ మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తున్నా .. వరల్డ్ కప్ వరకు డైనమిక్స్ మారుతాయని రవి చెప్పా డు. ఐపీఎల్ తో ఫైనల్ టీమ్ పై ఓఅంచనాకు వస్తా మన్నాడు. ‘ధోనీ భవిష్యత్ గురించి ఇప్పుడైతే ఏం మాట్లడలేం. ఏ నిర్ణయమై నా ఐపీఎల్ తర్వా తే. ఆటకు దూరంగా ఉన్నమహీ ట్రెయినింగ్ దలుపెట్టాడా? ఐపీఎల్ లో అతను ఎలా ఆడతాడు. వికెట్ కీపింగ్ లో మిగతా ప్లేయర్లు ఎలా ఆడుతున్నారు. ధోనీ ఫామ్ తో పోలిస్తే వాళ్ల పరిస్థి తి ఏంటీ. ఫామ్ , గాయాలు, ఇతరత్రా ఫిట్ నె స్ సమస్యల కారణం గా వరల్డ్ కప్ వెళ్లే టీమ్ లో ఎవరెవరు ఉంటారు. వీటన్నిటికి పరిష్కారం ఐపీఎల్ . ఈ టోర్నీ ముగిసేసరికి ఆసీస్ ఫ్లైట్ ఎక్కే 17 మంది ఎవరనేది తేలుతుంది.దీనిలోనే ధోనీ ఫ్యూచర్ కూడా ముడిపడి ఉంది’అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
మరోవైపు ధోనీ సన్నిహిత వర్గాలు కూడా ఇదే విషయాన్నిధ్రువీకరిస్తున్నాయి .దాదాకు హ్యా ట్సాప్ తొలి డేనైట్ టెస్ట్ ను సూపర్ సక్సె స్ చేసినందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, క్యాబ్ పై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించా డు. కీలక సమయంలో దాదా బోర్డు పగ్గాలు చేపట్టినందుకు చాలా సంతో షంగా ఉందన్నా డు. ‘గంగూలీ చాలా తెలివైన ప్లే యర్ , కెప్టెన్ . ఈ రెండింటికి మించి గొప్ప అడ్మినిస్ట్రేటర్ . అధ్యక్ష పదవికి అతను ఎన్ని కవ్వడం విలువను పెంచిం ది. ఓ క్రికెటర్ గా బోర్డును మరింత ఉన్నత స్థి తికి తీసుకెళ్తాడన్న నమ్మకం ఉంది. పింక్ టెస్ట్ ను అద్భుతంగా నిర్వహించారు. మూడు రోజులు ఓ పండుగ వాతావరణాన్ని తలపించింది’ అని శాస్త్రి వ్యాఖ్యానించాడు.