ఇందిరా గాంధీ, వాజ్‌పేయికీ ఓటమి తప్పలేదు

ఇందిరా గాంధీ, వాజ్‌పేయికీ ఓటమి తప్పలేదు

ముంబై: ఓటర్లను పట్టించుకోకపోతే ఓటమి తప్పదని ఎన్సీపీ ప్రెసిడెంట్ శరద్ పవార్ చెప్పారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఓటర్లను పట్టించుకోనందున శక్తిమంతులైన ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి వారికీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదని పవార్ గుర్తు చేశారు. తాను తిరిగొస్తానని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ఇలాంటి వైఖరిని ఓటర్లు సహించరని, వీరికి గుణపాఠం నేర్పించాలని భావిస్తారని తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. తమను పట్టించుకోకపోతే ఓటర్లు సహించరు. ఇందిర, వాజ్‌పేయి లాంటి మాస్ బేస్ ఉన్న పవర్‌‌ఫుల్ లీడర్స్‌కే ఓటమి తప్పలేదు’ అని పవార్ పేర్కొన్నారు.