స్థానిక లబ్ధిదారులకే డబుల్ బెడ్రూంలు అందించాలి : బాధితులు

స్థానిక లబ్ధిదారులకే డబుల్ బెడ్రూంలు అందించాలి : బాధితులు

హైదరాబాద్ : ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ నందనవనానికి కేటాయించింన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరగాయని వైఎస్ఆర్ టీపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. స్థానిక లభ్దిదారులకు కాకుండా స్థానిక టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ స్థానికేతరులైన ఆమె బంధువులకు, వారి సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారని ఆరోపించారు. బాధితులతో కలిసి ఆందోళన చేపట్టిన నేతలు.. హస్తినాపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా చేశారు. 

స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఎలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తారని వైఎస్ఆర్ టీపీ నాయకులు మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన మాజీ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్దిదారులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో బాధితులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.