Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్

Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్(Double Ismart). డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut) విలన్ రోల్ లో కనిపించనున్నాడు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో డబల్ ఇస్మార్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి కొంత కాలంగా ఎలాంటి అప్డేట్స్ రావడంలేదు. 

దాంతో.. ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు వినిపించాయి. సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతోందని, ఆ కారణంగా సినిమాను తాత్కాలికంగా ఆపేశారనే కామెంట్స్ కూడా వినిపించాయి. దాంతో.. రామ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. చాలా మంది నిజమే అనుకున్నారు కూడా. అయితే.. తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది చిత్ర నిర్మాత ఛార్మి. 

తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొత్త డబల్ ఇస్మార్ట్ కొత్త షెడ్యూల్ పూజకి సంబందించిన ఫోటోలను షేర్ చేసింది. దానికి క్యాప్షన్ గా..  అద్భుతమైన షెడ్యూల్ ఆ గణేశుడి ఆశీర్వాదంతో మొదలయింది.. అంటూ రాసుకొచ్చింది. దీంతో డబల్ ఇస్మార్ట్ ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఛార్మి ఇచ్చిన తాజా అప్డేట్ తో రామ్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు షూటింగ్ ఎండింగ్ వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు చేస్తున్నారు అనేది తెలియడంలేదు గానీ, త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.