న్యూఢిల్లీ: మైగ్రైన్ (తలనొప్పి) కంట్రోల్ చేసే డివైజ్ నెరివియోని జర్మనీలో డాక్టర్ రెడ్డీస్ లాంచ్ చేసింది. సబ్సిడరీ కంపెనీ బెటాఫార్మా ద్వారా ఈ ప్రొడక్ట్ను తీసుకొచ్చింది. నెరివియోకి యూఎస్ ఎఫ్డీఏ అనుమతులు ఉన్నాయని పేర్కొంది.
ఈ డివైజ్ను కిందటేడాది ఇండియాలో లాంచ్ చేశారు. నెరివియోకి ఇండియాలో మంచి రెస్పాన్స్ వస్తోందని, న్యూరాలజిస్ట్లు ఈ డివైజ్ను రికమండ్ చేస్తున్నారని కంపెనీ పేర్కొంది.