భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్వాకం
జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లు, టీఆర్ఎస్ లీడర్లు హాజరు
భైంసా, వెలుగు: అధికారం ఉంది కదా.. ఏమైనా చేయొచ్చు అనుకున్నాడో ఏమో.. ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏకంగా తన బర్తడే పార్టీని గవర్నమెంట్ బిల్డింగ్లోనే అరేంజ్ చేశాడు. వందల మంది నేతలు, ఆఫీసర్లను పిలిచి మందు, విందు ఇచ్చి ఖుష్ చేశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి అగ్రికల్చర్ గోదాంను అందుకు వేదికగా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం భైంసా వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ పుట్టినరోజు. ఇతను ముథోల్ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. తన బర్త్డే రోజునే కొడుకు కేశఖండన ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. పల్సిలోని అగ్రికల్చర్ గోదాంను ఫంక్షన్ హాల్ కింద మార్చి జిల్లాలోని అధికార పార్టీ లీడర్లు, ఆఫీసర్లను ఆహ్వానించాడు. పిప్పెర కృష్ణ చైర్మన్ అయ్యాక ఫస్ట్టైం ఇస్తున్న విందు కావడంతో వందల సంఖ్యలో నేతలు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. మందు తాగి, విందు ఆరగించి ఎంజాయ్చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చిన్నట్లు వ్యహరించడం కరెక్ట్కాదన్నారు.
చర్యలు తీసుకుంటం
పల్సి అగ్రికల్చర్ గోదాంలో జరిగిన ధావత్పై మాకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా మార్కెటింగ్ఆఫీసర్అశ్వక్ తెలిపారు. బర్త్డేపార్టీపై ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.