మార్కెట్ గోదాంలో టీఆర్ఎస్​ లీడర్ల మందు.. విందు.. చిందు

మార్కెట్ గోదాంలో  టీఆర్ఎస్​ లీడర్ల మందు.. విందు.. చిందు

భైంసా వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్ నిర్వాకం
జిల్లా, మండల స్థాయి ఆఫీసర్లు, టీఆర్ఎస్​ లీడర్లు హాజరు

భైంసా, వెలుగు: అధికారం ఉంది కదా.. ఏమైనా చేయొచ్చు అనుకున్నాడో ఏమో.. ఓ వ్యవసాయ మార్కెట్ ​కమిటీ చైర్మన్ ఏకంగా తన బర్తడే పార్టీని గవర్నమెంట్ బిల్డింగ్​లోనే అరేంజ్ ​చేశాడు. వందల మంది నేతలు, ఆఫీసర్లను పిలిచి మందు, విందు ఇచ్చి ఖుష్​ చేశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి అగ్రికల్చర్​ గోదాంను అందుకు వేదికగా చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం భైంసా వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ పుట్టినరోజు. ఇతను ముథోల్​ఎమ్మెల్యే విఠల్ ​రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. తన బర్త్​డే రోజునే కొడుకు కేశఖండన ఫంక్షన్​ ఏర్పాటు చేశాడు. పల్సిలోని అగ్రికల్చర్​ గోదాంను ఫంక్షన్ ​హాల్ ​కింద మార్చి జిల్లాలోని అధికార పార్టీ లీడర్లు, ఆఫీసర్లను ఆహ్వానించాడు. పిప్పెర కృష్ణ చైర్మన్​ అయ్యాక ఫస్ట్​టైం ఇస్తున్న విందు కావడంతో వందల సంఖ్యలో నేతలు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. మందు తాగి, విందు ఆరగించి ఎంజాయ్​చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చిన్నట్లు వ్యహరించడం కరెక్ట్​కాదన్నారు. 
చర్యలు తీసుకుంటం 
పల్సి అగ్రికల్చర్ గోదాంలో జరిగిన ధావత్​పై మాకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా మార్కెటింగ్​ఆఫీసర్​అశ్వక్ తెలిపారు. బర్త్​డేపార్టీపై ఉన్నతాధికారులకు నివేదించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యూచర్​లో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.