హైదరాబాద్సిటీలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓజీ కుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టివేత..

హైదరాబాద్సిటీలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓజీ కుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టివేత..

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కాప్రా పద్మశాలి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్టీఎఫ్​పోలీసులు డ్రగ్స్​, ఓజీ కుష్​అమ్ముతున్న ఒకరిని పట్టుకున్నారు. టౌన్​షిప్లో ఓ చోట కారులో డ్రగ్స్​అమ్ముతున్నట్టు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్టీఎఫ్ ఎస్సై బాలరాజు, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు.

కారులో 3.20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 12.34 గ్రాముల ఓజీ కుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. కారులో ఉన్న యోగేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేశారు. నిందితుడిని విచారించగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పురానికి చెందిన అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు చెప్పడంతో అతడిపై కూడా కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కారును ఘట్​కేసర్ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పగించారు.

మరో రెండు కేసుల్లో గంజాయి..
అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని యూసఫ్ గూడ మెట్రో స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో ఎస్టీఎఫ్  డీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్సై జ్యోతి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 550 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  రాజేశ్​నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను అరెస్టు చేశారు. మోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఇదే టీం మరో కేసులో పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరు ప్రాంతంలో ఇద్దరి వద్ద 1.15 కేజీల గంజాయిని పట్టుకున్నారు. చిటుకుల సాయి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేశ్​ను అరెస్టు చేశారు.