తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి దాడి చేశాడు. మద్యం మత్తులో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇతా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు… రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో వాళ్ల ఇంట్లో పాము దూరింది.
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు తనను కాటేసిందన్న కోపంతో ఓ పామును కొరికి మూడు ముక్కలుగా చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఇతా జిల్లా అస్రాలి గ్రామంలో జరిగింది. గ్రామంలోని రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో సమయంలో అతన్ని ఓ పాము కాటేసింది. ఆ నొప్పిని భరించలేని రాజ్ కుమార్ కోపంతో ఆ పామును నోటితో ముక్కలు ముక్కలుగా చేశాడు.
విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తండ్రి అప్పటికప్పుడు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన కొడుకు తాగిన మత్తులో తనను కాటేసిన పామును కొరికాడని, ప్రస్తుతం అతని పరిస్థితి బాగాలేదని వైద్యులకు తెలిపాడు. అతనికి చికిత్స చేయించే స్థోమత లేదని, డాక్టర్లే దయతలచి కాపాడాలని వేడుకున్నాడు. కానీ రాజ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, అతన్ని వేరే హస్పిటల్ కు రిఫర్ చేశామని అతడికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ తెలిపాడు.