బిర్యానీ కోసం  రెస్టారెంట్ కు కన్నం

బిర్యానీ కోసం  రెస్టారెంట్ కు కన్నం

ఎల్ బీ నగర్,వెలుగు: తెల్లవారుజాము వరకు ఫుల్లుగా తాగిన యువకులు ఎక్కడా తినడానికి ఫుడ్ దొరక్కపోవడంతో ఓ రెస్టారెంట్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి బిర్యానీ తిన్నారు. ఈ ఘటన సరూర్ నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు దిల్ సుఖ్ నగర్ లోని భాగ్యశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ నలుగురు యువకులు మద్యం బాటిల్స్ తో వచ్చారు. రెస్టారెంట్ షెటర్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ బిర్యానీ తినడంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా తాగారు.  తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగం మొత్తం రెస్టారెంట్ లో సీసీ కెమెరాలో రికార్డైంది.

శుక్రవారం ఉదయం రెస్టారెంట్ యజమాని ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.