ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు

ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ వర్షంతో అతలాకుతలం అయింది. భారీ వర్షపాతంతో పాటు పిడుగులు పడటంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ నుంచి 9 విమానాలను వేరే ప్రాంతాలకు డైవర్ట్ చేశారు. ఈ విమానాల్లో ఆరింటిని జైపూర్ కు , రెండింటిని లక్నోకు, ఒక దానిని అహ్మదాబాద్ కు మళ్లించారు. 

ఢిల్లీ వాసులు మాత్రం వర్షంతో ఊపిరి తీసుకున్నారు. వాతావరణంలోని కాలుష్య స్థాయిలను ఈ వాన తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.