అర్హుల వివరాలు నమోదు అయ్యేలా చూడాలి.. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ రివ్యూ మీటింగ్

అర్హుల వివరాలు నమోదు అయ్యేలా చూడాలి.. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ రివ్యూ మీటింగ్

భద్రాద్రికొత్తగూడెం/ ములకలపల్లి, వెలుగు : అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చూడాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్​లో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. 

బూత్​ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాల సేకరణ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా వాటిని సేకరించాలే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్​తో కలిసి నిర్వహించిన వైరల్​ హెపటైటీస్​ ప్రోగ్రాం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి హెపటైటీస్​ కేసులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములకలపల్లి మండల కేంద్రంలో ఎస్ఐఆర్​ కార్యక్రమాన్ని కలెక్టర్​ అంకిత్​ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు చోటివ్వకుండా సవరణ చేపట్టాలని సూచించారు. అంనతంర మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ​