రూ.600 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో హరీశ్ చెప్పాలి

రూ.600 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో హరీశ్ చెప్పాలి

కేసీఆర్ ను ఓడించకపోతే తన జన్మ వృథా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక  కేసీఆర్ తన బానిసలతో తిట్టించి సంబరపడుతున్నారన్నారు.  ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ ను ఓడగొట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని..బీఆర్ఎస్ పెట్టినా గట్టెక్కలేరని విమర్శించారు. తాను ఇప్పటి వరకు ఓడిపోలేదన్నారు. 2018 ఎన్నికల కంటే ముందు ఈడీతో పాటు అన్ని సంస్థలతో దాడులు చేపించారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే ధైర్యం లేక వీఆర్వోలను తీసేశారని..వాళ్ల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగుల్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, ఈటెల, హరీష్ రావు పాత్ర ఏంటో అందరికి తెలుసన్నారు. తన ప్రతిష్టని ఓర్వలేక  చిల్లర ఆరోపణలు చేసి తనను బయటకి పంపించారన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ పరిచయాలు తనకు ఉన్నాయన్నారు

కేసీఆర్ బొమ్మపై గెలిచావని.. దమ్ముంటే రాజీనామా చేయమని చెబితే రాజీనామా చేసి గెలిచానని ఈటల అన్నారు.  ఈటల గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఓ ఎమ్మెల్యే సవాల్ చేశారన్నారు. రూ. 600 కోట్లు హుజురాబాద్ లో ఎలా ఖర్చు పెట్టారో హరీష్ రావు చెప్పాలని ప్రశ్నించారు. 2 లక్షల కోట్ల దళిత బంధుని హుజురాబాద్ లో ప్రకటించి.. 17,600 దళిత కుటుంబాలతో ప్రమాణం చేపించుకున్నారన్నారు.  రిటైర్డ్ అయితే ఉద్యోగులకు డబ్బు ఇచ్చే దమ్ములేదనే ..వాళ్ల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారని విమర్శించారు.