చిల్లర వేషాలు వేసి రెచ్చగొడితే మసైపోతరు

చిల్లర వేషాలు వేసి రెచ్చగొడితే  మసైపోతరు

కేసీఆర్ తీసేశాడు తప్ప తాను టీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కరోనా సమయంలో ప్రతిపక్షనేతలు తన పనితీరును మెచ్చుకుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని చెప్పారు. తాము ఎవ్వరి జోలికి పోమని, కానీ తమ జోలికి వస్తే ఎదిరిస్తామని తెలిపారు. చిల్లర వేషాలు వేసి, పిచ్చి పిచ్చిగా రెచ్చగొట్టే పనులు చేస్తే మాడి మాసైపోతారని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి, శంభునిపల్లిలో జరిగిన పాదయాత్రలో హెచ్చరించారు ఈటల.  ప్రాణముండగానే బొందపెట్టాలని వాళ్లు చూస్తున్నారని..  తనను చంపుకుంటారా? సాదుకుంటారా? హుజురాబాద్ ప్రజల ఇష్టమన్నారు.  మంత్రులుగా కాకున్నా మనుషులుగా గుర్తించమని అడిగినందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్.. మనుషులను గంజిలో ఈగలాగే తీసేసే రకమన్నారు. కేసీఆర్ కు రైతుల పైన, దళితులపైన ప్రేమ ఉండదన్నారు. కేసీఆర్ కు ఓట్లమీద, కుర్చీమీద మాత్రమే ప్రేమ ఉంటుందన్నారు. కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ గుర్తుతో గెలిస్తే... ఆయన బిడ్డ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎందుకు గెలవలేదన్నారు.