హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీపై బదిలీ వేటు

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీపై బదిలీ వేటు

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యపై బదిలీ వేటు పడింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బదిలీ చేశారు. ఈమేరకు సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఈరోజు ఉదయం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.  

లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనిని అప్పగించరాదని ఈసీ ఆదేశించింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు గురువారం లోగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని ప్రధాన కార్యదర్శిని ఈసీ కోరింది. ఇక,  తెలంగాణలో మే13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.